అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా ముందుకు: Bandi sanjay
ABN , First Publish Date - 2022-04-14T15:36:00+05:30 IST
అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా ముందుకుసాగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్: అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా ముందుకుసాగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఉదయం బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.... అంబేద్కర్ పెట్టిన బిక్ష కారణంగానే తాను ప్రధాని అయినట్లు స్వయాన మోదీ చెప్పారన్నారు. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తిగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని... అంబేద్కర్ను అవమాన పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఈరోజైనా ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్ని గుర్తుకు వస్తాయన్నారు. 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తా అని చేయలేదని.. బీజేపీ ఒత్తిడి మేరకు ఇప్పుడు పనులు ప్రారంభించారని తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలి తప్ప కల్వకుంట్ల రాజ్యాంగం సాగనివ్వమని స్పష్టం చేశారు. కుటుంబ పాలన అంతం కోసం పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశీస్సులతో పాదయాత్ర విజయవంతం అవుతోందని కోరుకుంటున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.