గ్రూప్ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలి: Bandi sanjay

ABN , First Publish Date - 2022-01-20T18:41:12+05:30 IST

గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.

గ్రూప్ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలి: Bandi sanjay

హైదరాబాద్:  గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1600 గ్రూప్-1 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. 10 ఏండ్లుగా గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులకు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. ఒక్కో ఐఏఎస్ అధికారి 3, 4 పోస్టులకు ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 4 వేల గ్రూప్ -2 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 2 వేల గ్రూప్ -3 పోస్టులు, 40 వేల గ్రూప్ - 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన  చెప్పారు. వేలాది గ్రూప్ పోస్టుల ఖాళీగా ఉండటంతో నత్తనడకన పాలన సాగుతోందని మండిపడ్డారు. పేదలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతున్నాయన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసుల్లో 25 ఏళ్లుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయని పరిస్థితి నెలకొంది. తక్షణమే పోస్టులు భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-20T18:41:12+05:30 IST