టీటీడీ ఉద్యోగిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: Bjp leader

ABN , First Publish Date - 2022-06-09T18:12:36+05:30 IST

టీటీడీ ఉద్యోగిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు.

టీటీడీ ఉద్యోగిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: Bjp leader

తిరుమల: టీటీడీ ఉద్యోగిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి(Bhanuprakash reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... గది ఇవ్వకపోతే విధుల్లో ఉన్న ఉద్యోగి పై దాడి చేస్తారా అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో ఎవరికీ భద్రతా లేకుండా పొయ్యిందన్నారు. ఈ ఘటనతో వైసీపీ గుండాయిజం దేవాలయల వద్దకు పాకిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో దాడికి పాల్పడిన వారిపై నామమాత్రపు కేసు నమోదు చేసి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దాడికీ పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా పోలీసులు కేసు నమోదు చెయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-09T18:12:36+05:30 IST