CM Ramesh: వరద బాధితులను ఏపీ సర్కార్ ఆదుకోవడం లేదు: సీఎం రమేష్

ABN , First Publish Date - 2022-07-25T18:35:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు.

CM Ramesh: వరద బాధితులను ఏపీ సర్కార్ ఆదుకోవడం లేదు: సీఎం రమేష్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని  బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్(CM Ramesh) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... పంచాయితీల నిధులు దారి మల్లించి, వాటిని ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సర్పంచ్‌లను ఢిల్లీకి తీసుకునచ్చి నిధులు మంజూరు గురించి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తెలంగాణ(Telangana)లో భద్రాచలం సమీప ప్రాంతాల్లో వరదలకు కారణం పోలవరం(Polavaram) కాదని... కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)ల నుంచి నీటిని ఒక్కసారిగా వదలడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని సీఎం రమేష్ అన్నారు.

Updated Date - 2022-07-25T18:35:48+05:30 IST