హుజూరాబాద్ గెలుపు...బీజేపీ భవిష్యత్తుకు నాంది: డీకే ఆరుణ
ABN , First Publish Date - 2021-07-30T18:28:11+05:30 IST
హుజురాబాద్ గెలుపు.. బీజేపీకి భవిష్యత్తుకు నాంది అని డీకే అరుణ అన్నారు.
హైదరాబాద్: హుజురాబాద్ గెలుపు.. బీజేపీకి భవిష్యత్తుకు నాంది అని డీకే అరుణ అన్నారు. మోసం, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వలనే దళితుబంధు పథకం తీసుకువచ్చారన్నారు. దళితులపై కేసీఆర్కు ప్రేముంటే రాష్ట్రమంతటా ఒకేసారి దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం ప్రభుత్వ డబ్బును ఖర్చు చేస్తున్న కేసీఆర్ను ప్రగతి భవన్ నుంచి తరిమికొట్టాలన్నారు. కావాల్సిన వారి కోసమే కోకాపేట భూములు రేట్లు పెంచారని ఆరోపించారు. అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ దళితబంధును తీసుకొచ్చారని డీకే అరుణ విమర్శించారు.