నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలే కేసీఆర్‌కు సమాధానం: Dk Aruna

ABN , First Publish Date - 2022-03-11T16:42:54+05:30 IST

రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు.

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలే కేసీఆర్‌కు సమాధానం: Dk Aruna

తిరుమల: రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలే కేసీఆర్‌కు సమాధానమన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పథకాలు అట్టర్ ప్లాప్ అయ్యాయన్నారు. ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ దుంధుబీ మోగిస్తుందని బీజేపీ నేత ధీమా వ్యక్తం చేశారు.


మోదీ నాయకత్వంలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని అన్నారు. బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేశారని... మోదీ చేసిన అభివృద్ధే బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 30 సంవత్సరాల తరువాత వరుసగా రెండవ సారి తిరిగి ఒకే పార్టీ యూపీలో అధికారంలోకి వచ్చిందని డీకే అరుణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-11T16:42:54+05:30 IST