టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు: ఈటల
ABN , First Publish Date - 2021-10-08T23:48:04+05:30 IST
జిల్లాలోని హుజురాబాద్లో ఉప ఎన్నికలు నిజాయితీగా జరిగితే టీఆర్ఎస్కు
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్లో ఉప ఎన్నికలు నిజాయితీగా జరిగితే టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఏబీఎన్తో బీజేపీ నేత ఈటల మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేసిందే టీఆర్ఎస్ వారేనని ఈటల ఆరోపించారు. తనపై మంత్రి హరీష్రావు మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నిజాయితీ లేదన్నారు. డబ్బు, మద్యాన్ని కేసీఆర్ నమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. హుజురాబాద్లో అరాచక ముఠా, దొంగల ముఠా తిరుగుతోందన్నారు. నిజాయితీగా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదుని ఈటల పేర్కొన్నారు.