టీఆర్ఎస్ పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ రావాలా?: గరికపాటి
ABN , First Publish Date - 2020-11-28T16:43:33+05:30 IST
భవిష్యత్లో తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకుల దృష్టి మరింత పెరుగుతోందని బీజేపీ సీనియర్ నేత గరికపాటి మోహనరావు అన్నారు.
హైదరాబాద్: భవిష్యత్లో తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకుల దృష్టి మరింత పెరుగుతుందని బీజేపీ సీనియర్ నేత గరికపాటి మోహన్రావు అన్నారు. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ రావాలా? అని ప్రశ్నించారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా వస్తున్నాయని తెలిపారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రలు నివేదికలు పంపలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ చేసిన అవినీతితో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ ఎన్నికల ప్రణాళిక ముందు టీఆర్ఎస్ ప్రణాళిక తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఎంఐఎంకు ధీటైన జవాబు చెప్పగలిగేది బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లపై చేయి వేస్తే ఏమవుతుందో ఎంఐఎంకు అర్థం కావట్లేదని గరికపాటి మోహన్రావు హెచ్చరించారు.