‘ఈగోయిజం, శాడిజం, ఫ్యాక్షనిజం వ్యక్తి జగన్’

ABN , First Publish Date - 2022-05-24T18:21:57+05:30 IST

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ విమర్శలు గుప్పించారు.

‘ఈగోయిజం, శాడిజం, ఫ్యాక్షనిజం వ్యక్తి జగన్’

గుంటూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) సీఎం అయ్యాక వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ(kanna laxmi narayana) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ వ్యాపార సంస్థల్లో పనిచేసే వ్యక్తులకు ప్రభుత్వంలో ఉద్యోగాలిచ్చారన్నారు. 2024లో మళ్లీ సీఎం కావటం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారన్నారు. నరేంద్ర మోదీ(Narendra modi) 130 సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ వాటిని నవరత్నాలుగా మార్చి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈగోయిజం, శాడిజం, ఫ్యాక్షనిజం కలగలిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తప్ప ఎవరూ వ్యాపారాలు చేసేందుకు వీల్లేదన్నారు. ఇసుక, గనులు, మద్యం వ్యాపారాలతో సంపదను ఏకీకృతంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైసీపీ గుండాలు దాడులు చేస్తున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-05-24T18:21:57+05:30 IST