Kanna sensational comments: ఏపీ సందను దోచుకున్న వ్యక్తి జగన్

ABN , First Publish Date - 2022-09-27T18:00:11+05:30 IST

సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kanna sensational comments: ఏపీ సందను దోచుకున్న వ్యక్తి జగన్

విశాఖపట్నం: సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి దోచుకున్న వ్యక్తి  జగన్ (CM Jagan) అని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ (AP CM) అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని.. రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజలను నమ్మించి జగన్ (YS Jagan mohan reddy) అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో అత్యంత ధనవంతుడు కావాలని జగన్ (YCP Chief) లక్ష్యమన్నారు. జగన్ సర్కారే లిక్కర్ వ్యాపారం చేయడం వలన రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని ఆయన తెలిపారు.


జగన్ అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించాలన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉంటే.. రాష్ట్రం వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. కడప పాలకులు... ఈ ప్రాంతానికి వస్తే ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. జగన్ లాంటి వారు సీఎంగా రాష్ట్రానికి ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలవరం (Polavaram) విషయంలో ఈ రాష్ట్రానికి చేతకాక పోతే, తప్పుకుంటే, మేమే కడతాం’’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 

Updated Date - 2022-09-27T18:00:11+05:30 IST