-
-
Home » Andhra Pradesh » bjp leader lanka dinakar andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
‘దావోస్ ప్రయాణం పెట్టుబడుల కోసం కాదని ముందే చేతులెత్తేశారా’
ABN , First Publish Date - 2022-05-14T16:42:06+05:30 IST
సీఎం జగన్ దావోస్ వెళ్ళినా డల్లాస్ వెళ్ళినా రాను పోను ఖర్చులు కూడా దండగే అని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు.
అమరావతి: సీఎం జగన్ (Jagan) దావోస్ వెళ్ళినా డల్లాస్ వెళ్ళినా రాను పోను ఖర్చులు కూడా దండగే అని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar)వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... దావోస్ ప్రయాణం పెట్టుబడుల కోసం కాదని ముందే చేతులెత్తేశారా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో పీపీఏ రద్దు, అమరావతి నిర్వీర్యం అనంతరం అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల నమ్మకం నీరుగారిందన్నారు. కియా ప్రతినిధులపై వైసీపీ ఎంపీ దాడిని ఏ అంతర్జాతీయ పెట్టుబడిదారులు మర్చిపోతారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం లేనప్పుడు ఎక్కడికి వెళ్లినా ఉపయోగం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రత్యేకత "రివర్స్ టెండరింగ్, సాండ్, ల్యాండ్ మైనింగ్ మాఫియలని" చెబుతారా అంటూ లంకా దినకర్ యెద్దేవా చేశారు.