‘జగనన్న పాలన రహదారుల గుంతల్లా చిరిగిన విస్తరి అయ్యింది’
ABN , First Publish Date - 2022-06-10T15:00:40+05:30 IST
రాష్ట్రంలో రహదారులపై స్థితిపై బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) విరుచుకుపడ్డారు.
అమరావతి: రాష్ట్రంలో రహదారులపై స్థితిపై బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) విరుచుకుపడ్డారు. రాష్ట్ర రహదారుల గుంతలు ప్రయాణికులకు ఆస్పత్రులకు దారులు అని అన్నారు. రాష్ట్రంలో నగర, గ్రామలకు ప్రయాణం ప్రాణాంతకమైన ప్రహసనం అయ్యిందని తెలిపారు.విశాఖ స్మార్ట్ సిటీని గొతుల సిటీగా మార్చేశారని, కర్నూల్ గుంతల నగరం చేశారని మండిపడ్డారు. చీకటి పడితే రాష్ట్ర రహదారులపైన ప్రయాణం ప్రాణాంతకంగా మారిందన్నారు. చినుకుపడితే రహదారులపైన మయసభ జలాశయ కొలను వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. చెడిన రాష్ట్ర రహదారుల వల్ల వాహనాల మరమత్తులు, ప్రయాణికుల వైద్యం ఖర్చులతో జేబులకు చిల్లు పడుతోందన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలన రహదారుల గుంతల్లా చినిగిన విస్తరి అయ్యిందని లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు.