Lanka dinakar: జగనన్న పాలనలో ఏపీ అభివృద్ధి అధమం...కేసులలో ప్రధమం
ABN , First Publish Date - 2022-08-30T16:51:24+05:30 IST
జగనన్న పాలనలో దేశంలోనే రాష్ట్ర అభివృద్ధి అధమం... రాజద్రోహం కేసులలో ప్రధమంలో ఉందని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: జగనన్న (CM Jagan mohan reddy) పాలనలో దేశంలోనే రాష్ట్ర అభివృద్ధి అధమం... రాజద్రోహం కేసులలో ప్రధమంలో ఉందని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిరంతరం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న ప్రభుత్వం, రాజకీయ విమర్శలను తట్టుకోలేక ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ విమర్శలు వ్యక్తిగతంగా మారడం ప్రమాదకరమని... సమాధానం చెప్పలేక దాడులు చేయడం ఆటవికమన్నారు. రాష్ట్రంలో రహదారుల ప్రమాదాల వల్ల మరణాలు 14.30% పెరగడమంటే రాష్ట్ర ప్రభుత్వ అధ్వాన్న రహదారుల నిర్వహణ వల్లనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్స్సీఆర్బీ 2021 నివేదిక ప్రకారం రాష్ట్రంలో పిల్లలపైన, మహిళలపైన దాడులు బాగా పెరిగాయని, కిడ్నాప్, హత్యలు కూడా పెరగడం పాలన వైఫల్యమే అని లంకా దినకర్ (BJP Leader) అన్నారు.