ఉపాధి హామీ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి: Lanka dinakar

ABN , First Publish Date - 2022-02-14T15:05:27+05:30 IST

రాష్ట్రంలో ఉపాధి హామీ ఉపాధి నిధుల దుర్వినియోగంపై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు.

ఉపాధి హామీ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి: Lanka dinakar

అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ ఉపాధి నిధుల దుర్వినియోగంపై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. ఉపాధా హామీ నిధుల దుర్వినియోగంలో దేశం మొత్తం మీద 4.21 లక్షల కేసులు నమోదు కాగా... ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో 1.20 లక్షలు ఉండడం దౌర్భాగ్యమన్నారు. మొత్తం ఉపాధి హామీ నిధులలో 26.80% అంటే రూ.261 కోట్ల దుర్వినియోగం అయిన డబ్బు ఏవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక ప్రకారం, దేశ వ్యాప్తంగా చేసిన సామాజిక తనిఖీలో అత్యధిక నిధుల దుర్వినియోగం ఏపీలో అయ్యాయని బయటపడిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉపాధి నిధుల దుర్వినియోగం అంచనాలు తీసుకుని 2021-22తో పోల్చితే 2022-23కి 25% తగ్గుదలకి కారణం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లీకేజీ ఎక్కువ ఉండడమే అని లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-02-14T15:05:27+05:30 IST