Lanka dinakar: మూడు రాజధానులు చెల్లని నాణ్యం లాంటిది

ABN , First Publish Date - 2022-09-19T20:18:12+05:30 IST

మూడు రాజధానులు చెల్లని నాణ్యం లాంటిదని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

Lanka dinakar: మూడు రాజధానులు చెల్లని నాణ్యం లాంటిది

ప్రకాశం: మూడు రాజధానులు చెల్లని నాణ్యం లాంటిదని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka dinakar) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల విషయంలో హైకోర్టు (AP High court) స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. పరిపాలనా వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికే జగన్ (CM Jagan) మూడు రాజధానుల నాటకాన్ని ఆడుతున్నారని మండిపడ్డారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌కు చేతకాకపోతే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తుందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లంకా దినకర్ (BJP Leader) ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-19T20:18:12+05:30 IST