ప్రధాని పర్యటనలో వివాదమే లేదు: లక్ష్మణ్

ABN , First Publish Date - 2020-11-28T17:53:02+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటనలో సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందకపోవడంపై బీజేపీ నేత లక్ష్మణ్ వివరణ ఇచ్చారు.

ప్రధాని పర్యటనలో వివాదమే లేదు: లక్ష్మణ్

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటనలో సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందకపోవడంపై బీజేపీ నేత లక్ష్మణ్ వివరణ ఇచ్చారు. ప్రధాని హైదరాబాద్‌ పర్యటనలో వివాదమే లేదని స్పష్టం చేశారు. రాజకీయ చర్చకు ఆస్కారం ఇవ్వకూడదనే మోదీ ఎవరినీ కలవడం లేదని తెలిపారు. పీఎం టూర్‌లో సీఎం పాల్గొనే విషయం ఆత్మగౌరవం అంశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ప్రధాని పర్యటనకు వెళ్లడం లేదని చెప్పారు. కేసీఆర్‌ పుట్టి మునుగుతుందనే ఆత్మగౌరవం అంశం తెస్తున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. 

Updated Date - 2020-11-28T17:53:02+05:30 IST