Muralidhar warning: త్వరలో కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదు
ABN , First Publish Date - 2022-08-08T19:42:12+05:30 IST
ఎం కేసీఆర్(CM KCR) ఒంటెద్దు పోకడ పోతున్నారని బీజేపీ(BJP) నేత మురళీధర్ రావు (Muralidhar rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్(CM KCR) ఒంటెద్దు పోకడ పోతున్నారని బీజేపీ(BJP) నేత మురళీధర్ రావు (Muralidhar rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధరల పెరుగుదలపై కేసీఆర్ చేస్తున్న అసత్య ప్రచారాలపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని స్పష్టం చేశారు. పక్క దేశాలతో పోల్చుకుంటే మన దేశం సంక్షోభంలోకి వెళ్లే అవకాశం లేదన్నారు. టీఆర్ఎస్ (TRS) వైఫల్యాలను దాచేందుకే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేసీఆర్.. ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదని మురళీధర్రావు హెచ్చరించారు.