రెండో దశ వ్యాక్సిన్ ఇవ్వటంలో ప్రభుత్వం విఫలం: బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-04-23T19:07:28+05:30 IST

కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు.

రెండో దశ వ్యాక్సిన్ ఇవ్వటంలో ప్రభుత్వం విఫలం: బీజేపీ నేత

విజయవాడ: కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోవాలని  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్నవారికి... రెండో దశ వ్యాక్సిన్ ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కోవిడ్ వచ్చిన వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఏ హాస్పిటల్‌లో బెడ్‌లు లేని పరిస్థితి నెలకొందని తెలిపారు. గుంటూరు నగరంలో ఎప్పుడు లేని విధంగా స్మశానలు శవాలతో నిండిపోయాయన్నారు. మన రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాలలో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల పరీక్షలను రద్దు చేసిందని...ఏపీలో పరీక్షలపై పునరాలోచించాలని తెలిపారు. హాస్పిటల్‌లో బెడ్‌ల సంఖ్యను, సిబ్బందిని పెంచాలని పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-04-23T19:07:28+05:30 IST