గో మూత్రం తాగితే కరోనా రాదన్న ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్‌కు కరోనా

ABN , First Publish Date - 2022-01-31T16:25:46+05:30 IST

భోపాల్ పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది...

గో మూత్రం తాగితే కరోనా రాదన్న ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్‌కు కరోనా

భోపాల్ (మధ్యప్రదేశ్): భోపాల్ పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.‘‘ ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా నాకు కరోనా పాజిటివ్ అని వచ్చింది...నేను వైద్యుల సంరక్షణలో ఉన్నాను. గత రెండు రోజులుగా నన్ను కలిసిన వారందరూ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్‌ ట్వీట్ చేశారు.ఆవు మూత్రం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను తగ్గించి, కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని గత సంవత్సరం ప్రజ్ఞా‌సింగ్ ఠాకూర్ చెప్పారు. ‘‘దేశీ ఆవు యొక్క గో మూత్రం మనల్ని ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను చాలా ఆరోగ్య సమస్యల్లో ఉన్నాను, కానీ నేను ప్రతిరోజూ గో మూత్రం తాగుతాను.గో మూత్రం తాగితే కరోనావైరస్ నివారణ కోసం మరే ఇతర ఔషధం తీసుకోనవసరం లేదు. నేను కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడలేదు.’’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చెప్పారు. 


ఆవు మూత్రం వల్ల నాకున్న కేన్సర్‌ నయం అయిందని, దీనివల్ల ఆరోగ్య ప్రయోజనం ఉందని ఎంపీ చెప్పారు.2008వ సంవత్సరంలో మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్నారు. ప్రజ్ఞా‌సింగ్ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతూ దాన్నుంచి బయటపడ్డారు. ‘‘నేను కేన్సర్ రోగిని,  గోమూత్రం, పంచగవ్య-మిశ్రమ ఆయుర్వేద మూలికలను తీసుకోవడం ద్వారా నన్ను నేను కేన్సర్ బారినుంచి నయం చేసుకున్నాను’’ అని ప్రజ్ఞా‌సింగ్ చెప్పారు.


Updated Date - 2022-01-31T16:25:46+05:30 IST