2024 Lok Sabha elections: ప్రతిపక్షాలకు బీజేపీ సీనియర్ నేత సలహా
ABN , First Publish Date - 2022-08-30T22:45:53+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఉన్న గొప్పతనాన్ని
థానే (మహారాష్ట్ర) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలని ప్రతిపక్షాలకు బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadekar) సలహా ఇచ్చారు. దేశ ప్రజల కోసం మోదీ చేస్తున్న కృషిని గమనించాలని చెప్పారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల గురించి ఆందోళన చెందవద్దని, 2029లో జరిగే ఎన్నికల గురించి ఆలోచించాలని చెప్పారు. 2014లో మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో పరిస్థితి మెరుగైందన్నారు.
విభిన్నమైన ఆలోచనలతో అనేక పథకాలను అమలు చేస్తూ, నేరుగా ప్రజలతోనే మాట్లాడే ప్రధాన మంత్రి దేశానికి లభించారన్నారు. పరిపాలనలో పారదర్శకతను తీసుకొచ్చారన్నారు. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగానూ, ఎనిమిదేళ్ళు ప్రధాన మంత్రిగానూ పని చేసిన నరేంద్ర మోదీ గురించి వివరించే పుస్తకం ‘మోదీ@20’ ఆవిష్కరణ సందర్భంగా జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.