పల్లె, పట్టణ ప్రగతి ప్రచార ఆర్బాటం తప్ప అభివృద్ధి శూన్యం: Rao padma
ABN , First Publish Date - 2022-06-13T17:01:00+05:30 IST
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రచార ఆర్బాటం తప్ప అభివృద్ధి శూన్యం అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శలు గుప్పించారు.
హనుమకొండ: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రచార ఆర్బాటం తప్ప అభివృద్ధి శూన్యం అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శలు గుప్పించారు. అధికారులు, కార్పొరేటర్లు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి నిధులు లేక డుమ్మా కొడుతున్నారన్నారు. గత పల్లె, పట్టణ ప్రగతితో ఏమీ అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. డిజివిన్, గ్రామాల వారీగా ఎన్ని నిధుల ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. కేంద్రప్రభుత్వం నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతోందని రావు పద్మ తెలిపారు.