అంబేద్కర్‌కు బీజేపీ తరపున ఘనమైన నివాళి: Somuverraju

ABN , First Publish Date - 2022-04-14T17:56:18+05:30 IST

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు బీజేపీ తరపున ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు ఘనమైన నివాళి అర్పించారు.

అంబేద్కర్‌కు బీజేపీ తరపున ఘనమైన నివాళి: Somuverraju

విజయవాడ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు బీజేపీ తరపున ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు ఘనమైన నివాళి అర్పించారు. దేశంలో అంబేద్కర్‌కు ఇష్టమైన ఐదు ప్రాంతాలను పంచ తీర్ధాలుగా మోదీ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆ పంచ తీర్ధాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసి ప్రజలు సందర్శించే కార్యక్రమం చేపట్టారని తెలిపారు. అంబేద్కర్ ఆశయం సమ్మిళత అభివృద్ధి... దానిని మోదీ ముందుకు తీసుకెళుతున్నారని బీజేపీ నేత అన్నారు. 18 లక్షల 60కోట్ల డబ్బును ఎస్సీ, ఎస్టీలకు మోదీ అందించారన్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు, ఇళ్లు, స్వయం ఉపాధి కింద అనేక కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. స్టాండప్ ఆఫ్ ఇండియా కింద ఎస్సీ, ఎస్టీలకు చేయూతను ఇచ్చామన్నారు. అనేక గ్రామాలను ఆధునీకరించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేశారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను, లక్ష్యాలను మోదీ అమలు చేసి చూపారని సోమువీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-14T17:56:18+05:30 IST