ఏపీలో విచ్చల విడిగా రేషన్ బియ్యం అక్రమ రవాణా: Somuverraju

ABN , First Publish Date - 2022-04-21T19:32:54+05:30 IST

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చల విడిగా జరుగుతోందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

ఏపీలో విచ్చల విడిగా రేషన్ బియ్యం అక్రమ రవాణా: Somuverraju

ప్రకాశం: రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చల విడిగా జరుగుతోందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... రేషన్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని తెలిపారు. తాము దొంగల్ని పట్టుకుంటే దొంగల ప్రభుత్వం తమపై కేసు పెట్టిందని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తినడానికి ఉపయోగపడని బియ్యం ఇస్తూ బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంత మంది మంత్రులు క్రైస్తవ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారన్నరు. ఒక మహిళా మంత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై కేసులు పెట్టించి ఉద్యోగం నుండి తొలగించారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ప్రతి కొండపై శిలువలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో జిన్నా సర్కిల్ పేరుని తొలగించి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం వచ్చినప్పుడల్లా షాపులు మూసివేయడం కరెక్ట్ కాదన్నారు. అధికారంలో లేనప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో ఉండేవారని...ఇప్పుడు లోపల ఉంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం పర్యటనల కోసం బలవంతంగా కార్లు లాక్కోవడం సరికాదని సోమువీర్రాజు అన్నారు. 


Updated Date - 2022-04-21T19:32:54+05:30 IST