Somuveerraju: మోదీ దత్తపుత్రికగా ఏపీ అభివృద్ధి చెందుతోంది

ABN , First Publish Date - 2022-09-06T20:34:43+05:30 IST

రాష్ట్రంలో రెండు పార్టీలు కుటుంబ పాలన సాగించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు.

Somuveerraju: మోదీ దత్తపుత్రికగా ఏపీ అభివృద్ధి చెందుతోంది

అన్నమయ్య: రాష్ట్రంలో రెండు పార్టీలు కుటుంబ పాలన సాగించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somu veerraju) విమర్శించారు. మంగళవారం మదనపల్లిలో నిర్వహించిన రాష్ట్ర బీజేపీ నేతల (State BJP leaders meeting) సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ (PM Narendra modi) దత్తపుత్రికగా ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు. రూ.8.16 లక్షల కోట్లతో ఏపీ (Andhrapradesh)లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. జాతీయరహదారులు, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఏపీలో మోదీ జన్మదిన వేడుకలు జరుపనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. 

Updated Date - 2022-09-06T20:34:43+05:30 IST