Somuveerraju: మా పొత్తు జనం... జనసేనతోనే..

ABN , First Publish Date - 2022-09-24T18:38:43+05:30 IST

‘‘మా పొత్తు జనం, జనసేనతోనే. కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు

Somuveerraju: మా పొత్తు జనం... జనసేనతోనే..

నెల్లూరు:‘మా పొత్తు జనం, జనసేనతోనే. కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu veerraju) స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తీరం వెంబడి రూ.5లక్షల కోట్లతో రోడ్లు వేసేందుకు కేంద్రం (Central government) సిద్ధంగా ఉన్నా, వైసీపీ ప్రభుత్వం (YCP government) సిద్ధంగా లేదన్నారు.  కనీసం పోర్టులు కాదు కదా... ఒక్క బెర్త్ కూడా కట్టేపరిస్థితి లేదని తెలిపారు. నగరాల అభివృద్ధికి కేంద్రం రూ.2వేల కోట్లు ఇచ్చిందని,  రేషన్ బియ్యం దగ్గర నుంచి అన్నీ కేంద్రమే ఇస్తోందన్నారు. మోదీ పది లక్షల ఇళ్లు ఇస్తే కట్టే పరిస్థితి లేదన్నారు.  రైతులకు సరైన సమయంలో మద్దతు ధర ఇవ్వకుండా కమిషన్ల కోసం దళారులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 14, 15 ఆర్ధిక సంఘం నిధులు గ్రామాలకి‌ ఇస్తే, ఆ నిధులన్నీ మళ్లించారని సోమువీర్రాజు (BJP Leader) ఆరోపించారు. 

Updated Date - 2022-09-24T18:38:43+05:30 IST