Somuveerraju: వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

ABN , First Publish Date - 2022-09-03T19:46:09+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాటకు దిగనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.

Somuveerraju: వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

అమరావతి: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాటకు దిగనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu veerraju) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఐవైఆర్ కృష్ణారావు కన్వీనర్‌గా 8 మందితో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల గుర్తింపుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై 15న కమిటీ లిస్ట్ సిద్ధం చేయనుందని చెప్పారు. ఈనెల 18 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 నుంచి 30 ప్రాంతాల్లో వీధి సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు.  కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న పనులను వివరిస్తామని సోమువీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T19:46:09+05:30 IST