Somu veerraju: ఈ ప్రభుత్వం వచ్చి మూడేళ్లైంది... ఏం చేశారు?
ABN , First Publish Date - 2022-09-13T18:15:56+05:30 IST
పోలవరం డయాఫ్రమ్ వాల్ విషయమై మంత్రి అంబటి రాంబాబుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సెటైర్లు విసిరారు.
అమరావతి: పోలవరం డయాఫ్రమ్ వాల్ విషయమై మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati rambabu)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somuveerraju) సెటైర్లు విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం వచ్చి మూడేళ్లైంది.. ఏం చేశారని ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ (Diaphragm wall) ఇప్పటి వరకు ఎందుకు సరి చేయలేదని నిలదీశారు. హైడల్ పవర్ ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదని మండిపడ్డారు. కేంద్రం (Central government) నుంచి హైడల్ పవర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న నిధులేమయ్యాయన్నారు. గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల అనైతిక చర్యల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని విమర్శించారు. పోలవరం విషయంలో హైప్ క్రియేట్ చేశారని... గేట్లు పెట్టిన ప్రతిసారీ కొబ్బరి కాయలు కొట్టేశారని సోమువీర్రాజు (Somu veerraju) యెద్దేవా చేశారు.