Rajahmundry: ముంపు ప్రాంతాల్లో సోమువీర్రాజు పర్యటన

ABN , First Publish Date - 2022-07-22T16:39:53+05:30 IST

జిల్లాలోని హుకుంపేటలో మురుగునీటి ముంపుకు గురైన ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు శుక్రవారం పర్యటించారు.

Rajahmundry: ముంపు ప్రాంతాల్లో సోమువీర్రాజు పర్యటన

రాజమండ్రి: జిల్లాలోని హుకుంపేటలో మురుగునీటి ముంపుకు గురైన  ప్రాంతంలో బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు(Somuveerraju) శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ.. సావిత్రినగర్, రామకృష్ణనగర్ ముంపులో ఉన్నా కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు ప్రజల వద్దకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ లంక గ్రామాల తరహాలో రాజమండ్రిలో ముంపు ఏర్పడిందన్నారు. వర్షాకాలం ఇంకా రెండు నెలలు ఉందని తెలిపారు. అధికారులు  తక్షణమే రాజమండ్రిలో లోతట్టు ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అన్నారు. వందేళ్ల నాటి డ్రైనేజ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూడాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-22T16:39:53+05:30 IST