కేసీఆర్ పగటి కలలు కంటున్నారు: Tarun chug

ABN , First Publish Date - 2022-06-11T18:10:58+05:30 IST

ఫాంహౌస్‌లో కూర్చొని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.

కేసీఆర్ పగటి కలలు కంటున్నారు: Tarun chug

న్యూఢిల్లీ/తెలంగాణ: ఫాంహౌస్‌లో కూర్చొని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో మహిళలపై ఘోరమైన రేపులు జరుగుతున్నాయని,  వాటిని అరికట్టడంపై కేసీఆర్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలలో రేప్ జరిగిందని, ముఖ్యమంత్రి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన  ఆరోపించారు.


రక్షక భటులే, భక్షక భటులుగా మారారన్నారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టు కేసీఆర్ తీరుతుందని యెద్దేవా చేశారు. దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయని,  ఆయనకు కూడా జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చేయలేకపోయాడు, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారని తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-06-11T18:10:58+05:30 IST