కబ్జాల తెలంగాణగా మారింది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-04-12T21:22:39+05:30 IST

దొంగ అధికారంలోకి వచ్చాక తెలంగాణ, కబ్జాల తెలంగాణగా మారిందని సీఎం కేసీఆర్‌పై బీజేపీ

కబ్జాల తెలంగాణగా మారింది: విజయశాంతి

నల్గొండ: దొంగ అధికారంలోకి వచ్చాక కబ్జాల తెలంగాణగా రాష్ట్రం మారిందని సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆమె నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గ పరధిలోని నెల్లికల్లులో బీజేపీ అభ్యర్థి రవినాయక్ తరపున ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లికల్లులో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణ రాగానే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన దొర మోసం చేశారని విమర్శించారు.  


సాగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్నారని రాములమ్మ ఆరోపించారు. దొంగ అధికారంలోకి వచ్చాక కబ్జాల తెలంగాణగా మారిందన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటేస్తే మురిగిపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎక్కడా అధికారంలో లేదన్నారు. కేసీఆర్‌‌ను అణచాలంటే బీజేపీకి ఓటేయాలని ఓటర్లకు విజయశాంతి విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-12T21:22:39+05:30 IST