తెలంగాణలో లేని బస్సు ఛార్జీలు పెంపు... ఏపీలో మాత్రమే ఎందుకు?: Vishnu vardhan

ABN , First Publish Date - 2022-01-07T19:32:52+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఛార్జీల పెంపుపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణలో లేని బస్సు ఛార్జీలు పెంపు... ఏపీలో మాత్రమే ఎందుకు?: Vishnu vardhan

అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఛార్జీల పెంపుపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణలో లేని బస్సు ఛార్జీల పెంపు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఎందుకు ముఖ్యమంత్రి జగన్ గారు ?.. వారివి మాత్రం బస్సులు కావా? వారు వాడేది డీజిల్ కాదా!... మీ ప్రభుత్వం మద్యం ధరలు, సినిమా టికెట్ల రేట్లలో చూపించిన శ్రద్ధ, పేద ప్రయాణికుల బస్సు ఛార్జీల విషయంలో ఎందుకు చూపించడం లేదు?... చిన్న సినిమాను, పెద్ద సినిమాను ఒకేలా చూసిన వారు, సాధారణ బస్సులను, ప్రత్యేక బస్సులను ఒకేలా ఎందుకు చూడలేకపోతున్నారు? పండుగ బస్సుల్లో 50 శాతం రేట్ ఎందుకు ఎక్కువ?’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. ప్రత్యేక ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-07T19:32:52+05:30 IST