నెక్స్ట్ టైం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదు: Vishnu kumar

ABN , First Publish Date - 2021-10-20T19:07:17+05:30 IST

టీడీపీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు.

నెక్స్ట్ టైం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదు: Vishnu kumar

విశాఖపట్నం: టీడీపీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన అన్ని చోట్లా ఒకే సమయంలో ప్రీ ప్లాన్ దాడులు జరగడం అనుమానాలకు తావిస్తోందని..ఇది రాక్షస పాలనలా ఉందని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ టైం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల వైసీపీ డిపాజిట్ కోల్పోనుందన్నారు. 100 శాతం వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని..ఇందులో ఎటువంటి అనుమానం లేదని అన్నారు. సీఎంపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-20T19:07:17+05:30 IST