మంత్రి కనుసన్నల్లోనే హనుమాన్ శోభాయాత్రపై దాడి: బీజేపీ నేత

ABN , First Publish Date - 2022-04-20T19:17:57+05:30 IST

మంత్రి కనుసన్నల్లోనే హనుమాన్ శోభాయాత్రపై దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

మంత్రి కనుసన్నల్లోనే హనుమాన్ శోభాయాత్రపై దాడి: బీజేపీ నేత

కర్నూలు: మంత్రి కనుసన్నల్లోనే హనుమాన్ శోభాయాత్రపై దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... అరెస్టు చేసిన బీజేపీ వీమెచ్‌పీ నాయకులను విడుదల చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హోంమంత్రి ఉత్సవ విగ్రహాంలా మారారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అట్టహాసంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారని ఆయన తెలిపారు. 7 లక్షల 76 వేల కోట్లు అప్పు చేసి ఏపీలో పుట్టె బిడ్డపై కూడా అప్పు పెట్టారని మండిపడ్డారు. ఏపీని చూసి బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. వైసీపీకి ఇది ఆఖరి ప్రభుత్వమని వ్యాఖ్యలు చేశారు. పథకాల పేరుతో ప్రజలపై భారీగా అప్పులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-04-20T19:17:57+05:30 IST