సోమువీర్రాజుపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి: Vishnuvardhan reddy
ABN , First Publish Date - 2022-06-09T15:11:53+05:30 IST
బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అమరావతి: బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు(Somuveerraju)పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan reddy) డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రానికి కూడా పోలీసులు ఉన్నారని వైసీపీ మర్చిపోవద్దని హెచ్చరించారు. పోలీసుల కేసులకు బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. బీజేపీ, వైసీపీ రాజకీయ పోరులో పోలీసులు పావులు కావద్దని విష్ణువర్ధన్ రెడ్డి హితవుపలికారు.