తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా

ABN , First Publish Date - 2022-05-14T04:29:53+05:30 IST

మండలంలోని గోలేటి గ్రామంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు శుక్ర వారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

రెబ్బెన, మే 13: మండలంలోని గోలేటి గ్రామంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు శుక్ర వారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అంజనేయులుగౌడ్‌ మాట్లాడుతూ గోలేటి సర్పంచి గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధు లను దుర్వినియోగం చేశాడన్నారు. ఈ విషయంలో సమగ్రవిచారణ జరిపి సర్పంచ్‌పై చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. అసెంబ్లీకన్వీనర్‌ సొల్లు లక్ష్మి, మండల ప్రధానకార్యదర్శి ఓదెలు, గోలేటి పట్టణ అధ్యక్షుడు నవీన్‌ గౌడ్‌, రాజేష్‌, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, నారాయణ, మల్లయ్య, మానస, లక్ష్మి పాల్గొన్నారు.

Read more