TS News: పాదయాత్రను అడ్డుకోవడంపై కోర్టును ఆశ్రయించనున్న బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2022-08-24T01:33:53+05:30 IST

Hyderabad: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నేతలు న్యాయస్థానం తలుపు తట్టనున్నారు. రేపు (బుధవారం) హైకోర్టులో రిట్ దాఖలు చేయనున్నారు. మొదట, రెండో విడత పాదయాత్రకు

TS News: పాదయాత్రను అడ్డుకోవడంపై కోర్టును ఆశ్రయించనున్న బీజేపీ నేతలు

Hyderabad: బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ (BJP) నేతలు న్యాయస్థానం తలుపు తట్టనున్నారు. రేపు (బుధవారం) హైకోర్టులో రిట్ దాఖలు చేయనున్నారు. మొదట, రెండో విడత పాదయాత్రకు లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై వస్తున్న లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టికి మరల్చేందుకు.. టీఆర్ఎస్ సర్కార్ (TRS) దాడులు చేయిస్తోందని పేర్కొన్నారు. పోలీసులు, నోటీసులు పాదయాత్రను అడ్డుకోలేవని చెప్పారు.  

Updated Date - 2022-08-24T01:33:53+05:30 IST