జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌: మణిపూర్ బీజేపీదే

ABN , First Publish Date - 2022-03-08T01:53:51+05:30 IST

మణిపూర్‌‌లో‌ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోనుందని జీ న్యూస్ ఎగ్జిట్ పోల్..

జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌: మణిపూర్ బీజేపీదే

న్యూఢిల్లీ: మణిపూర్‌‌లో‌ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోనుందని జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఎన్.‌బీరేన్ సింగ్ సారథ్యంలో బీజేపీ 39 శాతం ఓట్ షేర్‌తో తిరిగి అధికారంలోకి వచ్చే వీలుందని తెలిపింది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 32 నుంచి 38 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 12 నుంచి 17 సీట్లు, ఎన్‌పీఎఫ్ 3 నుంచి 5, ఎన్‌పీపీ 2 నుంచి 4 సీట్లు గెలుచుకునే వీలుందని అంచనా వేసింది. బీజేపీ 39 శాతం ఓటింగ్ షేర్ రాబట్టనుందని, కాంగ్రెస్‌కు 30 శాతం, ఎన్‌పీఎఫ్ 9 శాతం, ఎన్‌పీపీ 6 శాతం, ఇతరులకు 16 శాతం ఓట్ షేర్ లభిస్తుందని ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

Updated Date - 2022-03-08T01:53:51+05:30 IST