విజయవాడ: ప్రారంభమైన బీజేపీ ముఖ్య నేతల సమావేశం
ABN , First Publish Date - 2021-06-13T17:13:39+05:30 IST
బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది.
విజయవాడ: నగరంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి పీ. మురళి ధరన్ అధ్యక్షతన ఈ భేటి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నేషనల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ సింగ్, సోమూ వీర్రాజు, పురంధేశ్వరి, సత్యకుమార్, కన్నా లక్ష్మినారాయణ, నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం, ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశమున్నట్లు సమాచారం.
అంతకుమందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మురళీధరన్కు ఎయిర్ పోర్టులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.