Covid19 నియంత్రణకు గోమూత్రం తాగాలన్న బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-05-10T01:20:53+05:30 IST

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ అనే ఎమ్మెల్యే కరోనా నియంత్రణకు గోమూత్రం ఔషదమని చెప్తున్నారు. తనకు తానుగా తీసుకున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియలో ‘‘అనుమానాలు వద్దు

Covid19 నియంత్రణకు గోమూత్రం తాగాలన్న బీజేపీ నేత

లఖ్‌నవూ: కరోనా నియంత్రణకు శాస్త్రీయ పరిశోధనల మాట ఎలా ఉన్నా.. కొంత మంది కొంత కాలంగా తమ నోటికి వచ్చింది వాగుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉండడం దురదృష్టకరం. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు అనేక వ్యాఖ్యలు చేశారు. పాపడాలు తింటే కరోనా పోతుందని, వేడి నీళ్లు తాగితే కరోనా పోతుందని.. ఇలా అనేకానేక వ్యాఖ్యలు చేశారు. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కరోనా నివారణకు గోమూత్రం దివ్యమైన ఔషదమని ఆయన వాదన. ఈ స్టేట్‌మెంట్ పాతదే అయినప్పటికీ, ఈయన శాస్త్రవేత్తలను లేక్కలోకి తీసుకోవద్దంటూ తాజాగా చెప్పడం గమనార్హం.


ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ అనే ఎమ్మెల్యే కరోనా నియంత్రణకు గోమూత్రం ఔషదమని చెప్తున్నారు. తనకు తానుగా తీసుకున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియలో ‘‘అనుమానాలు వద్దు. కోవిడ్-19కు విరుగుడు గోమూత్రం మాత్రమే అనే నిశ్చయానికి వచ్చాను. శాస్త్రవేత్తలు ఇది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు’’ అని అన్నారు. దాంతో పాటు ఈ గోమూత్రాన్ని ఎలా తీసుకోవాలో కూడా వివరించారు. ప్రతిరోజు ఉదయాన్నే గ్లాస్ చల్లని నీటిలో గోమూత్రం కలుపుకొని తాగితే కరోనా నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. తాను అలా చేసే కోవిడ్ బారి నుంచి తనను తాను కాపాడుకుంటున్నానని సురేంద్ర సింగ్ పేర్కొన్నారు.



Updated Date - 2021-05-10T01:20:53+05:30 IST