కేజ్రీవాల్ అపాయిమెంట్ కోసం కేసీఆర్ పడిగాపులు కాయటం సిగ్గుచేటు: Etela

ABN , First Publish Date - 2022-06-01T18:48:49+05:30 IST

రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు.

కేజ్రీవాల్ అపాయిమెంట్ కోసం కేసీఆర్ పడిగాపులు కాయటం సిగ్గుచేటు: Etela

హనుమకొండ: రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక సీఎం కేసీఆర్ (KCR) ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela rajendar) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) వద్ద అపాయిమెంట్ కోసం సీఎం కేసీఆర్ పడిగాపులు కాయటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులను వదిలి.. పక్క రాష్ట్రాల్లో చెక్కులు పంచటం సీఎం కేసీఆర్‌కు తగదన్నారు. 2018లో కేంద్రంలో చక్రం తిప్పుతా అని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్కబోర్ల పడ్డారని ఆయన తెలిపారు. ఉద్యోగులకు జీతాలు, సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వలేని అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని దుయ్యబట్టారు. చట్టాలను మార్చి అప్పులు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిని కాగ్ తప్పు పట్టిందన్నారు. 3లక్షల29 వేలకోట్లకు లెక్కలు చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-01T18:48:49+05:30 IST