మోకాళ్ల మీద నడిచినా...కేసీఆర్‌కు ఓటమి తప్పదు: Etela

ABN , First Publish Date - 2022-02-16T19:30:32+05:30 IST

ప్రధాని మోదీపై కేసీఆర్ పదజాలాన్ని ప్రజలు చీ కొడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

మోకాళ్ల మీద నడిచినా...కేసీఆర్‌కు ఓటమి తప్పదు: Etela

హైదరాబాద్: ప్రధాని మోదీపై కేసీఆర్ పదజాలాన్ని ప్రజలు చీ కొడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మోకాళ్ళ మీద నడిచినా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తన పని అయిపోయిన  కారణంగానే కేసీఆర్..  ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకుంటున్నారని అన్నారు. సలహాదారులు కాదు.. చరిత్ర గతిని మార్చేది ప్రజలేనని కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. తన కుతంత్రాలు.. కుట్రలు, పరిజ్ఞానం సరిపోనందునే కేసీఆర్ పీకే సాయం తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రానికి అరిష్టమని తెలంగాణ ప్రజలు స్థిర నిర్ణయానికొచ్చారని ఆయన అన్నారు.


ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ బానిసలన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే కేసీఆర్‌కు భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. క్యాబినెట్‌లో ఒక్కటే మంత్రి పదవి ఇచ్చి దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. సగానికి పైగా జనాభా ఉన్న ఓబీసీలకు మూడు మంత్రి పదవులు అన్యాయమని మండిపడ్డారు. సీఎం‌ కేసీఆర్ మట్లాడే భాషే  తెలంగాణ సంస్కృతి అని నమ్మించే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేసీఆర్ గంటలతరబడి ప్రెస్ మీట్లకు కారణం హుజురాబాద్ ఓటమే అని అన్నారు. కాళేశ్వరం ద్వారా కేవలం 48 టీఎంసీలు మాత్రమే నీరిచ్చారన్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులను సీఎం కేసీఆర్ నిలువునా మోసగించారని తెలిపారు. దళిత బస్తీల్లో కరెంటు కట్ చేస్తున్నారని.. జీరో డిపాజిట్ స్థానంలో డిపాజిట్ వసూలు చేయటం దుర్మార్గమని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-02-16T19:30:32+05:30 IST