కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో పలచబడింది: Etela
ABN , First Publish Date - 2022-05-13T16:28:31+05:30 IST
కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో పలచబడిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు.
తుక్కుగూడ: కేసీఆర్(KCR) ప్రభుత్వం ప్రజల్లో పలచబడిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela rajender) విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి అమిత్ షా(Amith shah) సభా ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం బీజేపీ నేతలతో కలసి ఈటల పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని మరిచి రాజ్యం మాదిరిగా కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలతో కేసీఆర్ పాలనా సాగుతోందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన అంతం చేయటానికే బండి సంజయ్(Bandi sanjay) పాదయాత్ర అని చెప్పుకొచ్చారు. పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా మాటలు చెప్తున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రిని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కు అహంకారం పెరిగిందని, సర్కార్పై ప్రజలు కన్నెర్ర చేస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు.