BJP ఎమ్మెల్యేపై రెండు అత్యాచారం కేసులు

ABN , First Publish Date - 2021-11-18T17:52:34+05:30 IST

పది నెలల్లో బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ పై రెండుసార్లు అత్యాచారం కేసులు నమోదు అయిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది...

BJP ఎమ్మెల్యేపై రెండు అత్యాచారం కేసులు

పది నెలల్లోనే ఇద్దరు బాధిత మహిళల ఫిర్యాదు

జైపూర్ (రాజస్థాన్): పది నెలల్లో బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ పై రెండుసార్లు అత్యాచారం కేసులు నమోదు అయిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ప్రతాప్ భీల్ రాజస్థాన్ రాష్ట్రంలోని గోగుండా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే.రెండు సందర్భాల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి, పెళ్లి సాకుతో మహిళలపై ఎమ్మెల్యే ప్రతాప్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతాప్‌ భీల్‌ తనపై అత్యాచారం చేశాడని తాజాగా ఓ మహిళ అంబామాత జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని భీల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత మహిళ చెప్పింది.


సుఖేర్‌లో 10 నెలల క్రితం ఎమ్మెల్యేపై మరో అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది.ఈ సందర్భంలో ఉద్యోగం కోసం ప్రతాప్ భీల్ తనను కలిసిన తర్వాత తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అతడు తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడని ఆ మహిళ ఆరోపించింది.గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే తన ఇంటికి వచ్చి తనపై అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని కూడా హామీ ఇచ్చాడని చెప్పింది.కాగా ఈ ఆరోపణలన్నింటినీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ కొట్టిపారేశారు.

Updated Date - 2021-11-18T17:52:34+05:30 IST