నాంపల్లి ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వొద్దు: Rajasingh
ABN , First Publish Date - 2021-12-30T18:06:30+05:30 IST
నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఎగ్జిబిషన్ వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఎగ్జిబిషన్ ఏర్పాట్లను నిలిపివేయాలని పట్టుబట్టారు. దేశంలో కరోనా, ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. పలు రాష్ట్రాలు న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు.