‘మంత్రి గారూ.. మరుగుదొడ్లు పరిశీలించండి’

ABN , First Publish Date - 2021-12-21T11:57:33+05:30 IST

అసెంబ్లీ సాక్షిగా గొప్పలు చెబుతున్న మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ

‘మంత్రి గారూ.. మరుగుదొడ్లు పరిశీలించండి’

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : అసెంబ్లీ సాక్షిగా గొప్పలు చెబుతున్న మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ మరుగుదొడ్లను ఒకసారి పరిశీలించాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రజా ధనాన్ని వెచ్చించి ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు నిర్వహణ లేక అధ్వానంగా మారాయని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలా వృధా చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

Updated Date - 2021-12-21T11:57:33+05:30 IST