కర్ణాటక బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం: Rajasingh

ABN , First Publish Date - 2022-06-04T16:37:18+05:30 IST

కర్ణాటక బస్సు ప్రమాద ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు.

కర్ణాటక బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం: Rajasingh

హైదరాబాద్: కర్ణాటక బస్సు ప్రమాద ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh) స్పందించారు. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. గతంలో ఇలాంటి బస్సు ప్రమాదాలు జరిగాయని, ప్రభుత్వం రెండు రోజులు హడావిడి చేసి వదిలేస్తునాయని మండిపడ్డారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఇష్టారాజ్యంగా బస్సులు తిప్పుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు. అక్కడి ప్రభుత్వం నుండి నష్టపరిహరం ప్రయత్నం చేస్తామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు రాజాసింగ్ తెలిపారు. 

Updated Date - 2022-06-04T16:37:18+05:30 IST