Rajasinghను బహిష్కరించండి.. స్పీకర్ పోచారంకు ఎంఐఎం ఎమ్మెల్యే లేఖ

ABN , First Publish Date - 2022-08-24T20:59:04+05:30 IST

జేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Bjp Mla Rajasingh)ను అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించాలని ....

Rajasinghను బహిష్కరించండి.. స్పీకర్ పోచారంకు ఎంఐఎం ఎమ్మెల్యే లేఖ

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Bjp Mla Rajasingh)ను అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinvas Reddy)కి ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ (MIM Mla Ahmed Pasha Quadri) లేఖ రాశారు. మహమ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలు శాసన సభ గౌరవాన్ని దిగజార్చాయని.. ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని లేఖలో పేర్కొన్నారు.  శాసన సభ సభ్యుడిగా చేసిన ప్రమాణాన్ని రాజాసింగ్ ఉల్లంఘించాడని, పదేపదే హింసను ప్రేరేపించాడని లేఖలో తెలిపారు. ముస్లింలపై శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించాడన్నారు.  రాజాసింగ్ శాసనసభ్యుడిగా ఉండేందుకు అనర్హుడని నిరూపించడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే  ఉదాహరణ అని పాషా ఖాద్రీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-24T20:59:04+05:30 IST