బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-04T17:16:26+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రారంభమైంది.

బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ నెల 7 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కాగా ఎమ్మెల్యేల మీటింగ్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు గైర్హజరయ్యారు. మల్లన్న సాగర్ నీటి విడుదల సంబంధించిన అధికారిక కార్యక్రమం ఉండటంతో హాజరుకాలేదని రఘునందన్  రావు తెలిపారు. 

Updated Date - 2022-03-04T17:16:26+05:30 IST