Bjp ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే...
ABN , First Publish Date - 2022-03-12T18:28:45+05:30 IST
రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయ, పట్టభ ద్ర నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యహరాల ఇన్చార్జి
బెంగళూరు: రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యహరాల ఇన్చార్జి అరుణ్సింగ్ నగరంలో ఒక ప్రకటన విడుదల చేశారు. నార్త్ ఈస్ట్ టీచర్స్ నియోజకవర్గానికి అరుణ్ శహపూర్, నార్త్వెస్ట్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి హనుమంత్ రుద్రప్ప నిరాణి, సౌత్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి ఎంవీ రవిశంకర్ పేర్లను ఖరారు చేశారు.