కేసీఆర్‌కు ముస్లింల పట్ల ప్రేమ పరాకాష్టకు చేరింది: MP Arvind

ABN , First Publish Date - 2022-05-03T19:29:24+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముస్లింల పట్ల ప్రేమ పరాకాష్టకు చేరిందని ఎంపీ అరవింద్ అన్నారు.

కేసీఆర్‌కు ముస్లింల పట్ల ప్రేమ పరాకాష్టకు చేరింది: MP Arvind

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముస్లింల పట్ల ప్రేమ పరాకాష్టకు చేరిందని ఎంపీ అరవింద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గ్రూప్ వన్ ఉద్యోగాల్లో రాత పరీక్షను ఉర్దూలో నిర్వహించడం వల్ల ఓ వర్గం వారికే లాభం కలుగుతుందన్నారు. పరీక్ష పేపర్లు దిద్దే వాళ్ళు వారే ఉంటారు కనుక వారికి లాభం కలుగుతుందని తెలిపారు. కేసీఆర్ వారికి ఇచ్చే ఈద్ ముబారక్ ఇదే అని... ఓవైసీ శాసిస్తే కేసీఆర్ పాటిస్తారని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పిచ్చోడు... ప్రజలను కూడా పిచ్చోళ్ళు అని అనుకుంటారని వ్యాఖ్యానించారు. గ్రూప్ 1ను ఉర్దూలో పెట్టి ఇంటర్వ్యూలు తీసేయడం రజాకార్ల పాలన కాదా అని ప్రశ్నించారు. తుగ్లక్ నిర్ణయాలన్నీ వాపస్ చేస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. 

Read more